ముస్తాబాద్, జూలై 30 (24/7న్యూస్ ప్రతిది): ఈకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులు సాగుకు తీసుకున్న అన్నిరకాల రుణాలను మాఫీ చేస్తామని తెలిపి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పడంతో పాటు 2018 డిసెంబర్ నెలకు ముందు తీసుకున్న ఋణం మాఫీకావని చెప్పడం ఎంతవరకు సమంజసంమని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు తీసుకున్న పంట ఋణాలను మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ పేర్కొన్నారు. తక్షణమే రైతుల తరుపున ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట ఋణాలను మాఫీ చేయాలని కోరాడు.
