24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25)
సిద్దిపేట జిల్లా ములుగు మండలం తానేదర్ పల్లి గ్రామంలో మందాల నర్సమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు లింగారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. వారితోపాటు గొల్లపల్లి శంకర్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి రాజు గౌడ్,గుండ్ల అశోక్ గౌడ్, యటకారి ఆంజనేయులు, దయాకర్ రెడ్డి, కనకయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
