Breaking News

ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి…

131 Views

జులై 3, 24/7 తెలుగు న్యూస్:ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు.. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7