ప్రాంతీయం

ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ సర్వసాధారణం పడాల కిషన్ సేవలు మర్చిపోలేనివి ఉమ్మడి మండలాల విద్యాధికారి నరసమ్మ

248 Views

ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగులకు పదవి విరమణ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని ఉమ్మడి మండల విద్యాధికారి నర్సమ్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న జీవ శాస్రం ఉపాధ్యాయులు పడాల కిషన్ పదవీ విరమణ అభినందన సభలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ నర్సమ్మ హాజరై శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పదవి కాలం పూర్తి కావడంతో పడాల కిషన్ విద్యార్థులకు బోధించిన పాఠాలతో పాటు ఆయన విద్యార్థులకు అందించిన పలు సూచనలు ఎంతో విద్యార్థులకు ఉపయోగపడ్డాయని ఆమె గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలో పని చేస్తున్నారని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంతో వరంగా మారాయని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంసాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, రాయపోల్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, అనాజిపూర్ ప్రధానోపాధ్యాయులు మేరీ నిర్మల కుమారి, రామారం ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి, వడ్డేపల్లి ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, బేగంపేట ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, కుకునూరుపల్లి ప్రధానోపాధ్యాయులు సత్తయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, ఎంపీటీసీ లక్ష్మి, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివలింగం, సీనియర్ ఉపాధ్యాయులు గోవర్ధన్, రాజ్ కుమార్, నరేందర్ రెడ్డి, యాదయ్య, నవీన్, మహేష్, శ్యాంసుందర్, నాగరాజు, కనకయ్య, రాములు గౌడ్, నరేందర్, లక్ష్మీపతి, విద్యాసాగర్, నర్సింలు గౌడ్, ఇప్ప కనకయ్య, అనీఫ్, సీఆర్పీలు స్వామి గౌడ్, యాదగిరి, కుమార్ స్వామి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka