ప్రాంతీయం

గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

82 Views

గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 900 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం మూడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఇందుప్రియల్ ఎక్స్ రోడ్ లో ఎస్సె శ్రీరామ్ ప్రేమ్ దీప్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దొనపల్లి రాజు, పిట్ల నవీన్, తొర్రి దర్శన్ లను పట్టుకొని విచారించగా వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నందుకు ఎస్సె శ్రీరామ్ ప్రేమ్ దీప్, సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్సె రఘుపతి, ఏఎస్ఐ సాయిలు, పోలీసు సిబ్బందీ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka