ప్రాంతీయం

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. బేగంపేట్ ఎస్సై భువనేశ్వర్

52 Views

మారకద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని బేగంపేట ఎస్ఐ భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేటలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఉపన్యాసము, పెయింటింగ్ గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బేగంపేట్ ఎస్ఐ భువనేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువతకు బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో మారకద్రవ్యాల విషయములో యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka