Breaking News

బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు

73 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

మంచిర్యాల మున్సిపాలిటీలోని తిలక్ నగర్ నుండి అండర్ ఫ్రిడ్జ్ వరకు 5 కోట్ల 85 లక్షల రూపాయలతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.

అలాగే ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే ప్రతి పని తాను తీసుకొచ్చిన నిధులనుండే చేస్తున్నారని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంచిర్యాల నియోజకవర్గానికి తెచ్చింది ఏమి లేదని అన్నారు..

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, కౌన్సిలర్లు ఆఫిజబేగం తాజుద్దీన్, శ్రీరాముల సుజాత మల్లేష్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ర శంకర్, తోట తిరుపతి, శ్రీపతి శ్రీనివాస్ ,పడాల శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7