తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఇండియన్ నేవీ ద్వార శుభవార్త వెలుబడింది. అగ్ని వీరు పథకం ద్వారా ఇండియన్ నేవీలో ఎస్ ఎస్ ఆర్, యం ఆర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ వెలుబడింది. ఆన్లైన్ అప్లికేషన్స్ తేదీ 13 మే నుండి 27 మే 2024 వరకు అప్లై చేసుకోవచ్చని ఆజా డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. నేవీ ఎస్ ఎస్ ఆర్ కి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలని, అలాగే నేవీ యం ఆర్ పోస్టులకు గాను పదవ తరగతిలో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే ఈ కింది 9948643620, 8290694814 నెంబర్లను సంప్రదించగలరని ఓ ప్రకటనలో నీల చంద్రం తెలిపారు.




