సిద్దిపేట జిల్లా, దుబ్బాక, మార్చి 10, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా దుబ్బాక యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ధర్మాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్లో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు పాపా గారి నరేష్, దుబ్బాక మండల అధ్యక్షుడు పాశం వేణు, ఆధ్వర్యంలో, సావిత్రిబాయి పూలే, వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది.. దీనితోపాటు టాలెంట్ టెస్ట్ పెట్టిన సందర్భంగా ప్రథమ,ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





