ముస్తాబాద్, మే 10 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు కనమేని చక్రదర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ కేంద్రంలోని మాదిగ సంఘ సభ్యులతో పలు అంశాలపై చర్చించి మీ అమూల్యమైన ఓటును ఇప్పుడున్న స్థితిగతులను ఆలోచించి హస్తంగుర్తుపై వేసి కరీంనగర్ ఎంపీగా రవీందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, వెలిచలా రాజేందర్ రావు
కుటుంబ సభ్యులు, ముస్తాబాద్. పట్టణశాఖ అధ్యక్షులు గజ్జెలరాజు, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




