ప్రాంతీయం

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

130 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని చిప్పలపల్లి గ్రామంలోని ఆ మహనీయుని విగ్రహానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్మాటి రాజమల్లు ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా రాజలింగంతో పాటు పలువురు  నాయకులు మాట్లాడుతూ సబ్బండవర్గాలు భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో తాడేపు ఎల్లం, గాడిచర్ల దేవయ్య, మాచేటి లచ్చయ్య, జంగా బాపురెడ్డి, సుద్దాల దేవయ్య, రామ్ రెడ్డి, రాజిరెడ్డి, ఆగంరెడ్డి, పొన్నాల లింగం, డాక్టర్ శ్రీనివాస్, రాజు, బాలయ్య, నర్సింలు, చంద్రయ్య, రాజయ్య, నరసయ్య, బుచ్చయ్య, వెంకటి, బాలయ్య, నరేష్, దేవయ్య, రాకేష్, ఎల్లయ్య, పెంటయ్య, దేవయ్య, బాలఎల్లయ్య, గ్రామంలోని గ్రామపెద్దలు అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7