ముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే సెల్ఫోన్ వెతికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.




