ముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రానికి చెందిన పల్లెపు రాధిక అక్రమంగా గుడుంబా అమ్ముతూ గురువారం ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం… గతంలోనూ పల్లెపు రాధిక మండల కేంద్రంలో పలుమార్లు అక్రమంగా గుడుంబా అమ్ముతు పట్టుబడినట్లు ధ్రువీకరించారు. పల్లెపు రాధికని మొదటిసారిగా అక్రమంగా గుడుంబా అమ్ముతున్న నేరంలో పట్టుకొన్న ఎక్సైజ్ పోలీసులు ఆమెను స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో బైండోవర్ చేశారు. పల్లెపు రాధికని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో బైండోవర్ చేసినా కానీ ఆమె గుడుంబా అమ్మకాలు ఆపలేదు. దీనితో స్థానిక ముస్తాబాద్ తహసిల్దార్ పల్లెపు రాధికకు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష రూపాయల జరిమాన కట్టాలని పలుమార్లు నోటీసులు అందించారు. పల్లెపు రాధిక తహసీల్దార్ నోటీసులపై స్పందించకపోవడంతో స్థానిక తహసిల్దార్ పల్లెపు రాధికకు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చారు. తాహసిల్దార్ ఆదేశాల మేరకు పల్లెపు రాధికను కరీంనగర్ జైలుకు తరలించిన ఎక్సైజ్ అధికారులు మండలంలో ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు.
28 Viewsమంచిర్యాల జిల్లా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పై వివక్షకు నిరసనగా.. టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ పిలుపు మేరకు.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు […]
60 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం లోని పారుపల్లి గ్రామంలో శ్రీ కలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే డా జి. వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
35 Viewsప్రజాపాలనలో రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం..! మంచిర్యాల నియోజకవర్గం. ఎమ్మెల్యే సాగరన్నకు రైతులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దండేపల్లి మండల ద్వారక గ్రామంలో రైతు వేదిక వద్ద జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , అధికారులు,రైతులు.. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి […]