ముస్తాబాద్, ఏప్రిల్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని మోర్రాయిపల్లి గ్రామంలో మండల ఎంపీపీ జనగామ శరత్ రావు సహృదయంతో నిరుపేద కుటుంబానికి చెందిన నిమ్మశెట్టి సత్తయ్య యాదవ్వ దంపతుల చిన్న కూతురు వివహానికి పుస్తే మట్టేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి అందించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బద్దిపడగ లక్ష్మణ్, పల్లె దేవయ్య, గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దిపడిగే సతీష్ రెడ్డి, మల్లారాపు రాజు, చారి, తదితరులు పాల్గొన్నారు.




