సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28
సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ గారి జన్మదిన పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ , నందమూరి తారకరామారావు ఆడిటోరియం లో ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రాంతాల నుంచి విచ్చేసిన మిమిక్రీ కళాకారులు మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు వై రమేష్ తన ప్రదర్శన ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం మిమిక్రీ రమేష్ ను జబర్దస్త్ ఫ్రేమ్ బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ , చంద్రముఖి చంద్రశేఖర్చే,తుల మీదుగా మేమంటో సర్టిఫికెట్ తిసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన మిమిక్రీ చంద్రముఖి చంద్రశేఖర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళలో మిమిక్రీ ఒకటని ఈ కళను మరుగునపడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.





