సంఘ భవనాలకు నిధుల మంజూరు..
♥.
ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ కు బుధవారం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కంచర్ల రాజు కంచర చిన్న నరసింహులు కంచర్ల శరబందు నరసయ్య గౌడ సంఘం నాయకులు నారాయణ గౌడ గంట రమేష్ గౌడ్ గంట బాలరాజ్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ బిజెపి నాయకులు చల్ల సత్య రెడ్డి చందుపట్ల లక్ష్మారెడ్డి మానుక కుమార్ యాదవ్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు




