మార్చి 8, 24/ తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం
తమ విద్యాసంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ ని ఐఐటీ మద్రాస్
ఆహ్వానించింది.
ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (ఈ – సమ్మిట్ ) ఈ- సమ్మిట్లో కీలకోపన్యాసం చేయాలని కోరింది.
ఐఐటీ మద్రాస్లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది