Breaking News

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామన్నారు.

118 Views

తెలుగు 24/7 న్యూస్, మార్చి 4 :కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్

ఎల్.ఆర్.ఎస్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారు.

ఎల్ ఆర్.ఎస్.క్రమబద్దీకరణ కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.

ఎల్.ఆర్.ఎస్ స్కీం ఎవరు కట్టవద్దని నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్.ఆర్.ఎస్ నో టిఆర్ఎస్ అని పిలిపిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి
వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు

ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ మార్చి 31 లోపు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందా…?

ప్రజల దగ్గర దోచుకోవడానికే ఎల్.ఆర్.ఎస్ పెట్టారని సీతక్క అనలేదా…?

ప్రజల నుండి ఎల్.ఆర్.ఎస్ ద్వారా 20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది

కోమటిరెడ్డి కోర్టులో వేసిన
పిల్ ఏమైంది

కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎల్.ఆర్.ఎస్ ఉచితంగా ప్రజలకు చేయాలి

ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయకు భారం పడే అవకాశం వుంది

ఎల్.ఆర్.ఎస్ వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారు

ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది

25 లక్షల కుటుంబాలపై ఎల్.ఆర్.ఎస్.భారం పడబోతోంది

ఈ నెల 6 వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో,
హైదరాబాద్ నగరంలో హెచ్.ఎం.డీ.ఏ,జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడతాము

జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాము

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7