Posted onAuthorTelugu News 24/7Comments Off on కార్యదర్శిపై కేసు నమోదు…
171 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే ఫిర్యాదు రావడంతో అతనిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోండాపూర్ గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ ఇంటి నంబర్ 6–86 ఉండగా దానిని 6–88 అనే తప్పుడు నంబర్ను కార్యదర్శి రాజేశ్వర్ సృష్టించారు. దీంతో బాధితుడు సిరిసిల్లా జిల్లా కలెక్టర్తో పాటు గ్రామస్తులకు బాధితుడు ఫిర్యాదు అంద చేశారు. గ్రామ సర్పంచ్ లెటర్ ఫ్యాడ్ ఉపయోగించి ఈ తప్పుడు నంబర్ను సృష్టించి పబ్బా శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ స్థలాన్ని అప్పగించడంతో అతను కబ్జా చేశారనే ఫిర్యాదుతో కార్యదర్శి రాజేశ్వర్, మరో వ్యక్తి అయిన పబ్బా శ్రీనివాస్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ స్థలాన్ని కబ్జా చేసేలా అధికార దుర్వినియోగం చేసిన పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ కోరారు.
264 Views ముస్తాబాద్: అక్టోబర్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): బతుకమ్మ నేపథ్యంలో ఎవరైనా ఆకతాయిలు మహిళలు, యువతులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారి భరతం పడతామని ముస్తాబాద్ ఎస్సై గణేష్ హెచ్చరించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెర్రుమద్ది గ్రామంతో పాటు పాలు గ్రామాల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల వద్ద ఎవరైనా బిగ్గరగా హారన్ కొడుతూ రాష్ డ్రైవింగ్ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలకు, యువతులకు, బాలికలకు […]
137 Views ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ఆదివాసీలరా సీపీఎం పార్టీని వీడండి ములుగు జిల్లా,వాజేడు, సెప్టెంబర్ 20 వాజేడు మండలం పూసుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల మీద కన్నేసిన సిపిఎం పార్టీ నాయ కులు అయొక్క భూములను ఏటూరునాగారం వాజేడు వెంకటపురం మండలాలకు చెందిన గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు సిద్ధమై ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 పిసా చట్టాలను నీరుగార్చే చర్యలకు పాలుపడటాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ […]
309 Viewsజనగామ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అని, నేతాజీ ఆశయ సాధన కోసం,జనగామ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అందె […]