ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే ఫిర్యాదు రావడంతో అతనిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోండాపూర్ గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ ఇంటి నంబర్ 6–86 ఉండగా దానిని 6–88 అనే తప్పుడు నంబర్ను కార్యదర్శి రాజేశ్వర్ సృష్టించారు. దీంతో బాధితుడు సిరిసిల్లా జిల్లా కలెక్టర్తో పాటు గ్రామస్తులకు బాధితుడు ఫిర్యాదు అంద చేశారు. గ్రామ సర్పంచ్ లెటర్ ఫ్యాడ్ ఉపయోగించి ఈ తప్పుడు నంబర్ను సృష్టించి పబ్బా శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ స్థలాన్ని అప్పగించడంతో అతను కబ్జా చేశారనే ఫిర్యాదుతో కార్యదర్శి రాజేశ్వర్, మరో వ్యక్తి అయిన పబ్బా శ్రీనివాస్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ స్థలాన్ని కబ్జా చేసేలా అధికార దుర్వినియోగం చేసిన పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ కోరారు.
170 Viewsఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాన మంత్రిగా ఈ రోజు రాత్రి 7.30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 క్యాబినెట్లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే పీఎంవో ఆఫీస్ నుంచి ఫోన్ […]
124 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]
96 Viewsరానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి మార్చ్ 31 కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే.. చేవెళ్ల […]