(మానకొండూర్ పిబ్రవరి 28)
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రం లోని చాణక్య హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు 35 రకాల వర్కింగ్ మాడెల్స్ ను తయారుచేసి,వాటి పనితీరును సందర్శకులకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక పరికరాలు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీస్తాయని చెప్పారు.
ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.