ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో గూడెం, కొండాపూర్ ఇరు గ్రామాలలో సిసిరోడ్ నిర్మాణంకు భూమిపూజ కార్యక్రమం ఎంజీఎన్ఆర్ జిఎస్ 2023౼2024_ నిధులద్వార అభివృద్ధి పనులకు భూమిపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఉద్యోగాలు అనర్హులకు ఇప్పించుకున్నారన్నారు. ఆఖరికి గొర్ల పంపిణీ కార్యక్రమంలో కూడా స్కాములు చేశారని మండిపడ్డారు. ఆ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఊరికి నలుగురు మాత్రమే బాగుపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు చేకూరుతాయి అని అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఇన్ని రోజుల
నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు కేవలం ఎలక్షన్లకు మాత్రమే మమ్మల్ని వాడుకొని వదిలేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రెండు నెలల్లోనే మా బాధని అర్థం చేసుకొని రోడ్డు వేపిస్తుంది అని కాలనీవాసులు హర్షo వ్యక్తం చేస్తూ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ జడ్పిటిసి ఎంపీటీసీలకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి జడ్పిటిసి గుండం నర్సయ్య, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, గూడెం, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య గాంత రాజు ఎస్సీ సెల్ బి సి సెల్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా మండల
పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




