ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం నిమ్మలవారి పల్లి గ్రామానికి చెందిన నిమ్మల ప్రభాకర్ తండ్రి లింగయ్య, వయస్సు 37.సం.లు అనేవ్యక్తి ఫిబ్రవరి 23 ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో ఓడ్డుకు గడ్డి కోయిచున్న సందర్భంలో విద్యుత్ స్తంభం సపోర్టు వైరుకు ఇన్సులేటర్/ బొక్కలేకుండా బిగించడం వలన ఆ సపోర్ట్ వైరు మృతుడి మోకాళ్ళకు తగిలి విద్యుత్ షాక్ కొట్టడంతో మృతుడు మరణించినాడని, మృతుడి తండ్రి నిమ్మల లింగయ్య ఇ
చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.




