24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3)
ఆస్తులు ముఖ్యం కాదు! అమ్మ ముఖ్యం! అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు!
వీరి స్వస్థలం భద్రాద్రి,కొత్తగూడెం జిల్లా,బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి గ్రామం. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజాశ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.
తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకు పైగా హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ ఎఐజి లో కొనఊపిరితో ఉన్న తమ తల్లితో పాటు ఐసియూ లో ఉండి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు! ఈ అన్నదమ్ములు
ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి! తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎంత పొగిడినా తక్కువే. నేటి తరానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు.
