దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన భూదవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించగా గురువారం బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల స్వామి, కుమార్, బిక్షపతి, బాలస్వామి, దయాకర్, కిరణ్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు…….
