దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, ట్రై సిరీస్లకు జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవెల్లి అవనీష్ రావు కంగ్రాట్యులేషన్ తెలుపుతూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
