ముస్తాబాద్/అక్టోబర్/21; భారతదేశంలోని అటల్ బిహారి వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980 ఏప్రిల్ 6న ప్రారంభించిన ఈపార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. ఈసాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. అదే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ శుక్రవారం రోజున ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామమాని చెందిన
వరివెంకటేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షునిగా నియమించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోల కృష్ణగౌడ్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




