రాజకీయం

బిజెపి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని బిఆర్ఎస్కు ఓటెయ్యండి అంటున్న మంత్రి కేటీఆర్

84 Views

అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని, మంత్రి విమర్శించారు.

రేవంత్ తీరు ఓటుకు నోటు, సీటుకో రేటు అన్నట్టుగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెడితే అమ్మేస్తారని అన్నారు.

నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, అందరూ బీఆర్ఎస్‌ కే ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

కేసీఆర్‌ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రైతుబంధు ఇచ్చిన ఈగట్టున ఉంటారా? రాబంధుల్లా పీక్కుతిన్న ఆగట్టునుంటారా? తేల్చుకోవాలన్నారు.

రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పిలుపిచ్చారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *