ముస్తాబాద్, నవంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) కేటీఆర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాంమని సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర దళిత నాయకులు కొమ్మెట రాజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏకమైన కేటీఆర్ ని ఓడించలేరు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలలో కులాల మతాల మధ్యలో విద్వేషాలు పెంచి పోషించే బిజెపి పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు
. గతంలో ఉన్న సిరిసిల్ల అభివృద్ధి ఎలాఉంది మైక్ దొరికితే మస్తుగా మాట్లాడవచ్చు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన ప్రజా నాయకుడు కేటీఆర్ అని తెలుసుకోవాలి. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అభివృద్ధి రామన్నను గెలిపించుకొని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరము కలిసి కెసిఆర్ కు గిఫ్టుగా ఇద్దామన్నారు.




