. ముస్తాబాద్, జూలై14 కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణాలు మాఫీతో పాటు సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందించి రైతులకు మామిడి మొక్కలు వివిధ పంటలకు ఎరువులతో పాటు ఉచిత కరెంటు డ్రిప్ ఇరిగేషన్ ఉపాధి లేని వాళ్లకు ఉపాధి కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీనే అని గుర్తించుకోవాలి అన్నారు అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య తజ్జనభజన సాగుతుండగా గత 57 సంవత్సరాలకు పైచిలుకు పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎంతోమంది ఆత్మ బలిదారులవుతున్నాయని ఇకనుండి గొడవలు కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మని గుర్తు చేసుకోవాలన్నారు. రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేని బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంమని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే వారు చెబుతున్న ఉచిత 24 గంటల విద్యుత్ ఇవ్వడంపై జీవన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన సవాలును ఎందుకు స్వీకరించట్లేదు అన్నారు. ఇప్పటికైనా అనవసర ఆరోపనలను మాని ఉన్న ఈమూడు నెలల సమయంలో రైతులకు మేలు చేసే పనిని చేయండి అని హితవు పలికారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ బషీరుద్దీన్, పెండ్యాల నారాయణ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, అగుల్ల రాజం, కనిమేని శ్రీనివాస్, క్యారం రాజు, కమ్మరి శ్రీనివాస్, యారటి భరత్, గంత సాయికుమార్, బంటు దేవేందర్, వేంకట వినయ్, కుడుదుల శ్రీకాంత్, బరిగేలా ధనుష్, ఏక్రమోద్దిన్, కుడుదుల లింగయ్య, యారటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
189 Viewsగంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారు-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన రాత్రి తన ఇంట్లో కి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్ […]
39 Viewsమంచిర్యాల జిల్లా. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం […]
180 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 2, మంత్రి దత్తగ్రామం అయినా చీకొడు గ్రామంలో డబుల్ బెడ్రూంలో మోక్షం ఎప్పుడో.. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చీ కోడు గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయము విధిదమే గ్రామంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ మంత్రి నిర్మించకుండా కాలయాపన చేస్తూ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న కేటీఆర్ తన దత్తత తీసుకున్న […]