ముస్తాబాద్, నవంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) తుర్కపల్లి గ్రామంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోల్ల సాయిప్రసాద్ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు కేటీఆర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై తుర్కపల్లికి చెందిన
19మంది యూత్ సభ్యులు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కండువాలు వేసుకున్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కాశోళ్ళ పద్మా- దుర్గాప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షులు బాలకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




