ముస్తాబాద్/అక్టోబర్/19; విద్యార్థి ప్రజ్ఞ సంక్షేమ సంఘం ముఖ్యసలహాదారు ఎడమల హన్మంతరెడ్డి విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సౌజన్యంతో ఈవిద్యా సంవత్సరం 2022-2023.లో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు ఉచిత బస్సు పాసులు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ముస్తాబాద్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) ముస్తాబాద్ కు 146 బస్ పాస్ లు అందజేసారు. ఈఉచిత బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో విద్యార్థి ప్రజ్ఞ చీఫ్ అడ్వైజర్ విశ్రాంత మండల విద్యాధికారి ఎడమల హనుమంత రెడ్డి, ఆర్టీసీ అధికారులు రాజేందర్, మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.




