

Related Articles
ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…
123 Views ముస్తాబాద్ డిసెంబర్ 6, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త అంటరానితనం కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగశిల్పికి ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంగం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి […]
ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన
47 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి […]
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ
137 Views జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు వినోద్ కోహ్లి, సెక్రటరీ జనరల్ సభా నాయక్ లు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు జి యం అర్ గార్డెన్ లో జరిగిన మూడు రోజుల ఐజెయు ప్లీనరీ సమావేశంలో జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సెల్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 రాష్ట్ర లకు చెందిన జర్నలిస్టులు, తెలంగాణకు చెందిన 6వేల మంది […]

ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి (లక్ష) రూపాయల సేకరించి చెక్కురూపంలో పరశురాములు కుటుంబ సభ్యులైన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈలోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్తమిత్రుడు ఇక లేడనడం చాలా బాధాకరమని భౌతికంగా మామధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మామధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు పరశురాములు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, అగ్రారపు కనకయ్య, రాజగౌడ్, నీరెటి కిష్టయ్య, కొండం తిరుపతి, ఏళ్ళ దేవరాజులు ఉన్నారు.

