

Related Articles
బూరుగు పల్లి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పోషక వారోత్సవం అవగాహన
229 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బూరుగుపల్లి తేదీ:19-09-2023 మంగళవారం రోజున బూరుగుపల్లి గ్రామం లో పంచాయతీ సెక్రెటరీ రాచకొండ నాగరాజు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూప వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి […]
రాముని చెరువు పై ఉచిత మినరల్ వాటర్ పంపిణీ
87 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైన వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉదయం పూట వాకింగ్ కు వచ్చే వాకర్స్ కు ఎండాకాలం పూట దాహార్తిని తీర్చడానికి రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సీనియర్ వాకర్ సభ్యుడు సేవా నిరతుడు రాజ్ కుమార్ విద్యుత్ డిపార్ట్మెంట్ సహకారంతో (30)వ రోజు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,సింగరేణి విశ్రాంత […]
నిండుకుండలా మానేరుజలాశయం నేటి ఉదయంనుండి పర్వళ్లు…
328 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 26, గంభీరావుపేట మండల ఎగువ మానేరు జలాశయం ఈ ఉదయం నుండి మత్తడి దూకుతుంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31.అడుగులు కాగ పూర్తిస్థాయిలో నిండి మానేరు పర్వళ్లు తొక్కుతోంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటు గూడవెల్లి వాగు చెక్ డ్యాములు నిండుకుండలా నిండి కింది స్థాయికి వరద ఉధృతం కావడంతో ఇటు పాల్వంచ వాగు ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో మారేరుకు దివనున్న లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని […]

ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి (లక్ష) రూపాయల సేకరించి చెక్కురూపంలో పరశురాములు కుటుంబ సభ్యులైన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈలోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్తమిత్రుడు ఇక లేడనడం చాలా బాధాకరమని భౌతికంగా మామధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మామధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు పరశురాములు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, అగ్రారపు కనకయ్య, రాజగౌడ్, నీరెటి కిష్టయ్య, కొండం తిరుపతి, ఏళ్ళ దేవరాజులు ఉన్నారు.


