గజ్వెల్ నవంబర్ 9:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించారు.
గజ్వేల్ సీనియర్ పొలిటీషియన్ టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ కాంతారావు, టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మడుపు భూమిరెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ సంఘం నాయకుడు కొట్టాల యాదగిరిలతో కలిసి కెసిఆర్ గజ్వేల్ ఐఓసీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి హెలికాప్టర్లో కామారెడ్డికి తరలి వెళ్లారు.




