ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ నంది కిషన్ తన పెళ్లిరోజును పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మరియు హై స్కూల్ కు విద్యార్థులకు ఏమైనా గాయాలు అయితే చికిత్స చేయడానికి ఉపయోగపడే ప్రాథమిక చికిత్స కిట్ ల ను అందించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, జోన్ చైర్మన్ నందికిషన్, డిస్టిక్ క్యాబినెట్ మెంబెర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




