ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్7, ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో ఓబీసీ ఆత్మగౌరవ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని. ఈమేరకు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ ఓబీసీల ఆత్మగౌరవ సభకు మండలం నుండి తరలి వెళ్తున్న నాయకులు కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి ఓబిసి మండల అధ్యక్షుడు జిల్లాల మల్లేశం గౌడ్, సీనియర్ బిజెపినాయకులు అంజగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్, జిల్లా కార్యాలయ సహాయక కార్యదర్శి బాధనరేష్, బూత్ అధ్యక్షులు ఊరడి రాజు ఓబిసి బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ మొత్తంలో తరలి వెళ్లారు.




