ముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ముస్తాబాద్ మండలం బదనకల్ హైస్కూల్లో గురువారం రోజున మధ్యాహ్న భోజనములో పురుగులు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్ మాట్లాడుతూ బదనకల్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీకూడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించ లేనటువంటి పరిస్థితిలు నెలకొని ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెండింగ్లో ఉన్నటువంటివి బిల్లులు తక్షణమే అమలు చేయాలి మధ్యాన భోజన పథకాన్ని పెంచాలి లేని పక్షాన ఎస్ఎఫ్ఐగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈసందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కుర్ర
రాకేష్, విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నర్సింలు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




