ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 30, మండలంలోని తెర్లమద్ది గ్రామంలో కాంగ్రెస్ నాయకులు 6,గ్యారెంటీల గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6,గ్యారంటీలకు ప్రజల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది దాన్నిచూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపు గ్యారెంటీ అని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 24,గంటల కరెంటు ఇచ్చిన విషయం రైతులకు తెలవదా అన్నారు. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత 9,గంటల విద్యుత్తును లక్ష రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ మరియు సబ్సిడీలో రైతులకు కావలసిన పరికరాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూ రైతు కూలీలకు 12,వేల రూపాయలు మరియు రైతులకు 15,వేల రూపాయల వరకు రైతు భరోసా ఇస్తాము అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ కే ఉంది అన్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెన్షన్లు ఇవ్వలేని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పేపరు లీకేజీ చేసి 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి టిఎస్పిఎస్సి లీకేజ్ తో నాకేం సంబంధం లేదు అన్న తారక రామారావు ఈరోజు టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తాము అనడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ ని బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ గెలుపు తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, తెర్లుమద్ది గ్రామశాఖ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తలారి నర్సింలు, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, చికోడు గ్రామశాఖ అధ్యక్షులు బుగ్గ రమేష్, మండల ఉపాధ్యక్షులు తాడెపు కొమురయ్య, సీనియర్ నాయకులు వెలముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
145 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]
117 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన విద్యార్థి విభాగం. భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ భారతదేశపు తొలిమహిళా ఉపాద్యాయురాలు మహిళ విముక్తి ఉద్యమానికి మార్గదర్శకురాలు సత్య శోధనకు, సత్యసాదనకు ప్రతీక శ్రీమతి సావిత్రి భాయి ఫూలేగారు బాల్య వివాహాo చేసుకున్న స్త్రీ, భర్త మహాత్మ ఫూలే గారి ప్రోత్సాహంతో స్వంతంగా చదువుకున్న, బహుజన పేద మహిళల కోసం పాఠశాలలు […]
44 Viewsమంచిర్యాల జిల్లా. ప్రపంచం మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మంచిర్యాల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ర్యాలీలు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ దోమలు పెరగకుండా దోమలహాలు లేకుండా చేసుకొని దోమలు కుట్టకుండా […]