అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అనుసంధానంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు మరియు సిబ్బంది అందరిని అభినందించారు.. మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు




