రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు,
తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తూ బుధవారం గర్జనపల్లి నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మీదుగా ప్రగతి భవన్ కు పాదయాత్ర చేపట్టాడు .రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తన మద్దత్తు తెలియజేసినట్లు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.




