సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. జిల్లాకు చెందిన విద్యావంతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం యూనివర్సిటీ సాధనోద్యమ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బాబురావు, జగ్గు మల్లారెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
