ప్రకటనలు

ఎన్నికల ప్రవర్తన నియమావళికి తెలంగాణ సాంస్కృతిక సారథులు కట్టుబడి ఉండాలి 

115 Views

ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీపీరో ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో డీపీరో ఓ సమావేశం అయ్యారు.

అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 31 వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సౌకర్యార్థం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్న కనీస మౌలిక సదుపాయాలు,ఈవీఎం లను ఉపయోగిస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం, ఓటు హక్కు సద్వినియోగంపై ప్రచారం కార్యక్రమాలు చేపట్టాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *