దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామానికి చెందిన ముదిరాజులు హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం వస్తేనే ముదిరాజుల బతుకులు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశం, ముదిరాజులు వెంకట్, శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, లక్ష్మణ్, గణేష్, కిష్టయ్య, స్వామి, లచ్చయ్య, చంద్రం, సాయిలు, ప్రవీణ్, ఎలాష్, కనకయ్య, రమేష్, రాజు, బిక్షపతి, నర్సింలు, సత్తయ్య, రామకృష్ణ, యాదగిరి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు…




