తెలుగు న్యూస్ 24/7
నిడమానూరు : అక్టోబర్ 7
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని సాగు కొరకు నీటిని విడుదల చేసిన భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ…..ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం అయినా నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతుల కోరిక మేరకు రైతులు ఆరుకాలం పండించిన పంటలకు నీటి సరఫరా మేరకు జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సిఫారసు తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. కేసీఆర్ ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని మరొకసారి నిరూపించుకున్నారు యావత్ దేశంలో విస్తారమైన వర్షాలు కురిసినప్పటికీ, కృష్ణ పరివాహక ప్రాంతంలో వర్షాభావ ఫలితంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటిన ఉన్నా కానీ ఎడమ కాలవ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల శ్రేయస్సు మేరకు సాగునీరు విడుదల చేయించి వారి యొక్క ఆనందం చూడాలని కెసిఆర్ తెలియజేశారు అన్నాడు.




