రాగట్లపల్లి నుంచి నారాయణ పూర్ కు వెళ్ళేదారిలో ఎలుగుబంటి సంచారం
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో ఎలుగుబంటి సంచరించినట్లు గురువారం చూసిన ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రాగట్లపల్లి నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గురువారం రాత్రి వరకు గాలించారు ,
అయినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు ,
నారాయణపురం , రాగట్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంత ప్రజలను కోరారు,
