Breaking News నేరాలు

రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వృద్ధుడు మృతి

297 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సత్తె పీర్ల దర్గాకు వెళ్లే దారిలో సుమారు 70 సంవత్సరాల గుర్తుతెలియని వృద్ధుడు మంగళవారంరాత్రి నడుచుకుంటూ గొల్లపల్లి వైపు వస్తుండగా వెనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.పోలీసులు 108 కు సమాచారం అందించి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోకి తరలించారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *