ప్రాంతీయం

శంకుస్థాపనతో తీరనున్న చిరకాల స్వప్నం

178 Views

తెలుగు న్యూస్ 24/7

నిడమానూరు : సెప్టెంబర్ 29

మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా

  1. నిడమానూరు మండలం నిడమానూరు గ్రామంనుండి చింతగుడెం వరకు రూ.4 కోట్ల 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే రోడ్ పనులను శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండల పరిసర గ్రామంలో ప్రజల చిరకాల కోరిక నిడమనూరు నల్గొండ చింతగూడెం స్టేజీ మీదుగా రహదారి నిర్మాణం నేడు సహకారం అయిందని, దీనికి సహకరించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి, IT శాఖా మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కెసిఆర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు, కెసిఆర్ అధ్యక్షతన మరిన్ని అభివృద్ధి పనులు సాధించి నిడమనూరులో అభివృద్ధిలో ప్రథమ భాగంలో నిలబడతానని హామీ ఇచ్చాడు.

మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

1. ఊట్కూరు గ్రామంలో 22 లక్షల దయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభోత్సవం చేశారు.

2. ఊట్కూరు నుండి నందికొండ వారి గూడెం వరకు మూడు కోట్ల 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన శంకుస్థాపన చేశారు అలాగే

3. కనేకల్ గ్రామం నుండి కేశవపురం గ్రామ కొరకు రెండు కోట్ల 16 లక్షల వ్యయంతో నిర్మించబోయే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు,

4. ధర్మపురం గ్రామం నుండి పోచంపల్లి గ్రామం వరకు 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే నీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాడు

5. గోపాలపురం నుండి గూడూరు బాయి గ్రామము వరకు 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్వహించబోయే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,ఎంపీపీ బొల్లం జయమ్మ,జడ్పీటీసీ నందికొండ రమేశ్వరి,నిడమనూర్ హలియా మార్కెట్ లు చైర్మన్ మర్ల చంద్రారెడ్డి,జీవ్వాజీ వెంకటేశ్వర్లు,BRS సీనియర్ నాయకుడు చేకూరి అన్మంత్ రావు,ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి,మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య,సీనియర్ నాయకుడు బొల్లం సైదులు,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పోలె డేవిడ్,RSS జిల్లా డైరెక్టర్ అనుముల శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్ లచ్చయ్య,దేవాలయ చైర్మన్ మేరెడ్డి వెంకట్ రమణ, జలా పాపయ్య,సర్పంచ్ లు జానయ్య, రాంబాబు,పట్టణ అధ్యక్షుడు మాచర్ల దాసు, ఎంపీటీసీ విశ్వానదుల రాణి, మండల కో -అప్షన్ మెంబర్ SK సలీం,వున్నం శ్రీనివాస్ రావు, భాస్కర్, వున్నం ఈశ్వర్, తుడిమిళ్ల సైదాచారి, గన్నేపాక లక్ష్మణ్,మండల SC సెల్ అధ్యక్షుడు అల్లంపల్లి నరేష్,ఉద్యమకారుడు కొండల్,కందుల సైదమ్మ,ఆదిమల్ల భాస్కర్,నూనె ఉంపెదర్, గోగుల వెంకన్న, కందుల వెంకటేశ్వర్లు ఇదమూరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *