సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండలంలో బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారి సహకారముతో సీఎం సహాయ నిధికి *ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎం ఎల్ సి శ్రీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి గారి వద్ద అప్లై చేసుకోగా గ్రామ సర్పంచ్ మంజుల రమేష్,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ 24000 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది .లబ్దిదారురాలు సీఎం కెసిఆర్ కి, మంత్రి హరీష్ రావుకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ , గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోకల బాబు, నాయకులు వెంకటేష్, సురేష్, భాను తదితరులు పాల్గొన్నారు.
