బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి – శంకర్ శర్మ
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ,నవంబర్ 7
కార్తీక మాస బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని ఈనెల 9 11 2025 అనగా ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు మర్కుక్ మండలం గణేష్ పల్లి వద్ద గంగు దివాకర్ రావు సంధ్య దంపతుల వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే కార్తీక వనభోజనాలు, బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలని, దాత్రి నారాయణ కళ్యాణం గాయత్రి మహిళా సంఘం గజ్వేల్ వారిచే నిర్వహించే లలిత సహస్ర పారాయణం సాంస్కృతి కార్యక్రమాలు అనంతరం, కార్తీక వనభోజనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజం కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు





