రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజలందరూ బాగుండాలని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.సోమవారం రోజున రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పిటిసి గట్ల మీనయ్య తో కలిసి చల్మేడ రుద్రంగి మండల కేంద్రంలోని యాంగ్ వండర్స్ యూత్,మహాలక్ష్మి యూత్,ఎస్.ఆర్.ఆర్ యూత్,శ్రీ సర్వ జన గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు.
చేసిన గణనాథులను దర్శించుకున్నారు. తరువాత మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం శ్రీ లక్ష్మీనరసింహారావు ను మండపాల నిర్వాహకులు శాలువల తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ.గణేష్ నవరాత్రోత్సవాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆ గణనాథుడి ఆశీస్సులు రుద్రంగి ప్రజలపై ఉండాలని,వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు అందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.




