ముషీరాబాద్ సెప్టెంబర్ 22:సీఎంఆర్ఎఫ్ యల్ఓసి లెటర్ను అందజేసిన చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి..
సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా…
పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్…
ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితా లక్ష్మారెడ్డి.
అనారోగ్యా కారణంతో అత్యవసర చికిత్స గురించి నర్సాపూర్ నియోజకవర్గం, కుల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన కే. అక్షయ, భర్త/ప్రభాకర్ మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డికి దరకాస్తు చేసుకోగా మంజూరైన ₹ 2,50,000=00 ( రెండు లక్షల యాభై వేల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ లెటర్ ను) ఈ రోజు ముషీరాబాద్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉండి అతి కష్టం మీద వైద్యం చేయించుకున్న మరియు చేయించుకుంటున్న వారికి ఆర్ధిక సహాయంతో భరోసా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన మంచి సదవకాశమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నారని, అత్యవసర సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని సీఎంఆర్ఎఫ్ ను కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు……




